telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రోజాకు సీఎం జగన్ ఫోన్.. అమరావతికి రావాలని ఆదేశం!

roja

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు నగరి ఎమ్మెల్యే రోజాకు ఫోన్ చేశారు. వెంటనే అమరావతికి బయలుదేరి రావాలని ఆదేశించారు. దీంతో రోజా హుటాహుటిన హైదరాబాద్ నుంచి అమరావతికి బయలుదేరారు. ఇటీవల జగన్ నేతృత్వంలో ఏర్పడ్డ మంత్రివర్గంలో రోజాకు చోటు దక్కని సంగతి తెలిసిందే. రోజాకు ఈసారి తప్పకుండా కేబినెట్ లో చోటు దక్కుతుందని చాలామంది భావించారు.

అయితే సామాజిక సమీకరణాలు, ఇతర కారణాలతో ఆమెకు కేబినెట్ లో చోటు దక్కకపోవడంతో రోజా పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి కూడా హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో రోజాను సీఎం జగన్ ఆహ్వానించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రోజాకు కేబినెట్ హోదా గల నామినటెడ్ పదవి ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.

Related posts