telugu navyamedia
క్రైమ్ వార్తలు

రెండు నెల‌ల చిన్నారిని చంపేసిన క‌సాయి తండ్రి…

ఏపీ అనంతపురం జిల్లాలో దుర్ఘటన చోటు చేసుకుంది. క‌ట్టుకున్న భార్య మీద అనుమానంతో ఓ క‌సాయి తండ్రి రెండు నెల‌ల చిన్నారిని క‌డ తేర్చాడు. తన పోలికలతో పుట్ట లేదని అభం శుభం తెలియ‌ని చిన్నారి నోటికి ప్లాస్ట‌ర్ అతికించి గోనె సంచిలోపెట్టి చెరువులో పడేశాడు. ఈ హృదయవిదాకర ఘటన అనంతపురం జిల్లాలోని కళ్యాణ దుర్గంలో చోటు చేసుకుంది.

వివ‌ర్లాలోకి వెళితే..
కళ్యాణ దుర్గం ప‌ట్ట‌ణంలో నివాసం ఉంటున్న మల్లికార్జున్‌, చిట్టెమ్మ‌ కు రెండు నెలల క్రితం పాప పుట్టింది. అయితే పాపకు తన పోలికలు లేవని తరుచూ భార్యతో మల్లికార్జున్‌ గొడవ‌కు దిగేవాడు. ఎలాగైన చిన్నారిని చంపాలని భావించాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భార్యతో గొడవపడి రెండు నెలల పాపను తీసుకోని పరారయ్యాడు. దీంతో వెంటనే భార్య పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది.

Anantapur Crime: విషాదాంతమైన మూడు నెలల చిన్నారి మిస్సింగ్ కేసు, కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే..

భార్య‌ చిట్టెమ్మ ఫిర్యాదుతో నిన్నటి నుంచి గాలిస్తున్న పోలీసులు.. శుక్రవారం ఉదయం పోలీసులకు ఓ సంచిలో పాప మృతదేహం దొరికింది. పాప నోటికి ప్లాస్టర్‌ వేసి ఉండడంతో ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. అనంతపురంలో నిందితుడిని అరెస్టు చేశారు. విచారించగా తానే చంపి చెరువులో పడేశానని తెలిపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts