telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

మదనపల్లి ఘటనలో మూడో వ్యక్తి ప్రమేయం…?

మదనపల్లిలో సొంత కూతుళ్ల హత్యల కేసులో తల్లిదండ్రులు పురుషోత్తమ్‌, పద్మజను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరోనా టైంలో ఇంట్లో ఉంటూ… పూర్తిస్థాయిలో ఆధ్యాత్మికంగా లీనమైన కుటుంబం సభ్యులు… ఒకరకమైన మూఢత్వంలోకి వెళ్లిపోయారు. ఉన్మాదభక్తితో కన్నప్రేమను మర్చిపోయారా తల్లిదండ్రులు. కడుపున పుట్టిన పిల్లల్ని… కర్కషంగా చంపేశారు. డంబెల్‌తో కొట్టి.. శూలంతో గుచ్చి.. ప్రాణాలు తీశారు. ఈ హత్య కేసులో పోలీసులు సత్వరమే స్పందించారు అని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ… పోలీసులు సత్వరమే వెళ్లడంతో మానసిక దుర్బలత్వంతో ఉన్న నిందితుల ప్రాణాలు మిగిలాయి విచారణ పూర్తి చేసి 24 గంటల్లో నిందితులను అరెస్టు చేశాం. నిందితులు ఒక రకమైన ట్రాన్స్ స్థితిలో ఉండిపోయారు. తీవ్రమైన ఆధ్యాత్మిక చింతన, విచిత్రమైన మానసిక స్థితి లో ఉన్నారు. మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టాం. విపరీతమైన మూఢనమ్మకాలు విచిత్రమైన ఆధ్యాత్మిక ప్రవర్తన తో హత్యలు జరిగినట్టు భావిస్తున్నాం.ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు అనిపించడంలేదు. పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగిస్తాం అని అన్నారు.

Related posts