telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

280 కిమీ స్పీడ్‌లో బుల్లెట్ ట్రైన్… డోర్ ఓపెన్ లో… 340 మంది ప్రాణాలు అరచేతిలో…!?

Bullet-Train

బుధవారం ఈశాన్య జపాన్‌లోని సెండయ్ స్టేషన్ నుంచి షింకాన్సెన్ బుల్లెట్ ట్రైన్ ప్రారంభమైంది. అయితే తొమ్మిదో క్యారేజ్ డోర్ మాత్రం తెరిచే ఉండటంతో అందులో ప్రయాణిస్తున్న 340 మంది ప్యాసెంజర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించారు. డోర్ తెరిచే ఉన్నప్పటికీ.. బుల్లెట్ ట్రైన్ 280 కిలోమీటర్ల స్పీడ్‌లో దూసుకువెళ్లింది. ఒక నిమిషం తరువాత కండక్టర్ వార్నింగ్ లైట్‌ను గమనించడంతో.. ఓ టన్నెల్ వద్ద ట్రైన్‌ను ఆపారు. తొమ్మిదో క్యారేజ్‌కు వెళ్లి చూడగా.. మెయింటెనెన్స్ సిబ్బంది డోర్‌ను అన్‌లాక్ చేసి తిరిగి లాకింగ్ సిస్టమ్‌ను ఎనేబుల్ చేయడం మరిచిపోయినట్టు అధికారులు గుర్తించారు. ట్రైన్‌లో ఏ ఒక్కరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని.. భవిష్యత్తులో ఇటువంటి తప్పు మరోసారి జరగకుండా చూసుకుంటామని సిబ్బంది తెలిపింది.

Related posts