రాష్ట్రంలో తెదేపా కార్యాలయాలతోపాటు, తెదేపా నేతలపై దాడులకు నిరసగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష రెండో రోజు కొనసాగుతుంది. గురువారం ఉదయం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైన దీక్ష ఈవేళ ముగియనుంది.
చంద్రబాబు.. టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తల దాడులను నిరసిస్తూ దీక్ష చేస్తున్నారు.. ఆ దీక్షకు ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ అంటూ పేరు పెట్టారు. చంద్రబాబు.. ఇక, నిన్న కేవలం అర లీటర్ మంచినీరు మాత్రమే చంద్రబాబు తీసుకున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.. దీక్ష రెండో రోజుకు చేరుకోవడంతో.. కాసేపట్లో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.