*మరి కాసేపట్లో ఏపీ కాబినేట్ భేటి
*అసెంబ్లీ సమావేశాలు, సీపీఎస్ రద్దు సహా పలు అంశాలపై చర్చ..
మరి కాసేపట్లోఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది.
ఈ నెల 15వ తేదీవ తేదీ నుంచి 24వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
దీంతో సీపీఎస్ రద్దు తో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. జీపీఎస్ అమలుపై ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించిన జీవోలను అధికారులు సిద్ధం చేశారు.
వీటిని మంత్రి వర్గ సమావేశంలో లాంఛనంగా ఆమోదించే అవకాశముంది. దీంతో పాటు మూడు రాజధానుల అంశంపై కూడా చర్చ జరిగే అవకాశముంది. ఈ సమావేశాల్లోనే బిల్లులు ప్రవేశపెట్టే అవకాశముందని తెలుస్తోంది.