వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ‘అమ్మఒడి’ ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటూ వైసీపీ బడులు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. విద్యాశాఖా మంత్రి సాక్షిగా విద్యాలయాన్ని విషప్రచార నిలయంగా చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తెలుగు తల్లి పాటను ఆలపించడం రద్దు చేసి వైసీపీ పాటలు పెట్టేశారా? అంటూ ధ్వజమెత్తారు.
రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న.. అభివృద్ధికి పెద్దదిక్కు మన జగనన్నఅనే పాటకు గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులతో డ్యాన్స్ వేయించడం దారుణమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గా మార్చేశారా? అంటూ ఈ వరుస ట్వీట్లు చేశారు.