*వాళ్ల ఇళ్లను వాళ్ళే తగులు పెట్టుకొని ప్రతిపక్షాలుపై విమర్శలు చేస్తున్నారు..
*కోనసీమ అల్లర్లు వైసీపీ పనే..
అమలాపురం ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. అందమైన కోనసీమలో చిచ్చు పెట్టిన ఘనత వైసీపీదే నంటూ దుయ్యబట్టారు. పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి చేశారని.. మంటలను అదుపు చేసేందుకు ఫైరింజన్ కూడా రాలేదని చంద్రబాబు గుర్తుచేశారు.
వాళ్ల ఇళ్లను వాళ్లే తగులపెట్టుకుని వేరే వాళ్లపై నిందలేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులు చేసి.. ఆ నేరాన్ని ప్రతిపక్షాల మీద తోయడం జగనుకు అలవాటుగా మారిందని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని జగన్ నడపలేరని.. మధ్యంతరానికి సిద్దపడుతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.