ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్షేమాన్ని పక్కనపెట్టి సంక్షోభాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. క్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిన ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి రికార్డులు సృష్టించారని దుయ్యబట్టారు.
షరతుల్లేకుండా అందాల్సిన సంక్షేమాన్ని ఆంక్షల మయం చేశారని ఆరోపించారు. ప్రతీ పిల్లవాడికీ అన్న అమ్మఒడి వంచనకు కేరాఫ్ అడ్రస్ అయిందని కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు. 45 ఏళ్లకే పెన్షన్ అని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక తూచ్ అన్నారని మండిపడ్డారు. సన్నబియ్యం హామీపై అసెంబ్లీ సాక్షిగా మాట మార్చారన్నారు. అన్న క్యాంటీన్లను నిలిపివేసి పేదలు ఆకలి కేకలు వేసేలా చేశారన్నారు. సంక్షేమం హామీలతో బడుగు బలహీన వర్గాలను రోడ్డున పడేశారని విమర్శించారు.
ఏపీలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది: సజ్జల