వైసీపీ ప్రభుత్వం తొలిరోజు నుంచే విధ్వంసకర పాలన మొదలుపెట్టిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఈ ఆరు నెలల్లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులను గురి చేసే నిర్ణయాలు తీసుకుందనన్నారు. దీంతో తాము పోరాటం కొనసాగిస్తున్నామని చెప్పుకొచ్చారు.
కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇద్దామని అనుకున్నాం. కానీ, వైసీపీ ప్రభుత్వం తొలిరోజు నుంచే విధ్వంసకర పాలన మొదలుపెట్టిందని మండిపడ్డారు. ప్రజలకు నష్టం, కష్టం కలుగుతున్నప్పుడు ప్రతిపక్షంగా చూస్తూ కూర్చోలేమన్నారు. అందుకే బాధితుల పక్షాన అటు న్యాయపోరాటం, ఇటు రాజకీయ పోరాటం చేస్తున్నాం’ అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.