telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

జార్ఖండ్‌లో నేడు తొలి ద‌శ పోలింగ్.. బ్రిడ్జ్‌ను పేల్చిన‌ నక్సల్స్

maoist naksals

జార్ఖండ్‌లో నేడు తొలి ద‌శ పోలింగ్ ప్రారంభమైంది. భారీ సంఖ్యలో ఓటర్లు ఉదయంపూట ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ క్రమంలో గుమ్లా జిల్లాలోని బిష్ణుపూర్‌లో ఉన్న బ్రిడ్జ్‌ను మావోలు పేల్చివేసినట్లు డిప్యూటీ క‌మిష‌న్ రంజ‌న్ తెలిపారు. ఈ రోజు ఆ రాష్ట్రంలో తొలి ద‌శ పోలింగ్ లో భాగంగా 13 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓటింగ్ కొన‌సాగుతున్న‌ది.

అయితే మావోల చర్య వల్ల ఓటింగ్‌కు ఎటువంటి ఆటంకం క‌ల‌గ‌లేద‌ని పోలీసులు చెప్పారు. బ్రిడ్జ్ పేల్చివేత ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ గాయాలు కాలేదని తెలిపారు. మొత్తం 5 ద‌శ‌ల్లో జార్ఖండ్ ఎన్నిక‌లు జ‌రగనున్నాయి. అయితే తొలి ద‌శ‌లో 189 మంది అభ్య‌ర్థులు బరిలో ఉన్నారు.

Related posts