జార్ఖండ్లో నేడు తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. భారీ సంఖ్యలో ఓటర్లు ఉదయంపూట ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ క్రమంలో గుమ్లా జిల్లాలోని బిష్ణుపూర్లో ఉన్న బ్రిడ్జ్ను మావోలు పేల్చివేసినట్లు డిప్యూటీ కమిషన్ రంజన్ తెలిపారు. ఈ రోజు ఆ రాష్ట్రంలో తొలి దశ పోలింగ్ లో భాగంగా 13 నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగుతున్నది.
అయితే మావోల చర్య వల్ల ఓటింగ్కు ఎటువంటి ఆటంకం కలగలేదని పోలీసులు చెప్పారు. బ్రిడ్జ్ పేల్చివేత ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. మొత్తం 5 దశల్లో జార్ఖండ్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే తొలి దశలో 189 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
బాబు టూర్ ముగిసేలోపే ఏపీ ముఖచిత్రం మారిపోతుంది: విష్ణువర్థన్రెడ్డి