telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

చనిపోయేందుకు అనుమతించండి: నళిని

nalini Ltte

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య ఘటనలో నిందితురాలు నళినిగత 28 ఏళ్లుగా వేలూరు మహిళా కారాగారంలో శిక్ష అనుభవిస్తుంది. ఈ క్రమమంలో తనను చనిపోయేందుకు అనుమతించాలని (కారుణ్య మరణం) కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్టు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్రం శ్రీపెరంబదూర్లో మానవ బాంబు దాడిలో రాజీవ్ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.

ఈ దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నళిని, ఆమె భర్త మురుగన్ లు ఇద్దరినీ దోషులుగా పేర్కొంటూ కోర్టు శిక్ష విధించింది.నళినికి మరణ శిక్ష విధిస్తూ 1998, జనవరి 28న ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇవ్వగా దాన్ని జీవిత ఖైదుగా మారుస్తూ అప్పటి తమిళనాడు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.

తాము సుదీర్ఘకాలం నుంచి జైల్లో ఉన్నామని, తమను మానవతా దృక్పథంతో విడుదల చేయాలని కోరుతూ నళిని పలుమార్లు ప్రభుత్వాన్ని, న్యాయ స్థానాలను కోరుతూ వస్తున్నారు. అయినా ఎటువంటి స్పందన లేదు. దీంతో తమకు జీవితంపైనే విరక్తి కలుగుతోందని, చనిపోవాలని భావిస్తున్నామంటూ కారుణ్య మరణానికి లేఖ రాసినట్లు సమాచారం.

Related posts