telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రియాంకారెడ్డి హత్యపై స్పందించిన ఎమ్మెల్యే రాజా సింగ్

BJP-MLA Raja-Singh

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ వద్ద హత్యకు వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. వైద్యురాలిపై అత్యాచారం జరిపి సజీవ దహనం చేసిన ఘటన గురించి చదివి బాధపడ్డాను. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం, తెలంగాణ డీజీపీని కోరుతున్నాను . ఈ బాధాకర సమయంలో ప్రియాంకారెడ్డి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాను. ప్రియాంకారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

కాగా, ప్రియాంకా రెడ్డిని హత్యకు ముందు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసినట్లు సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే ఆడపిల్లలు బయపడేలా ఈ ఘటన చోటు చేసుకుంది.

Related posts