ఆంధ్రప్రదేశ్ లో ఇసుక సమస్యపై టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు విజయవాడలోని ధర్నాచౌక్లో దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఉదయం ప్రారంభించిన పన్నెండు గంటల నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఈ సందర్భంగా డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
చంద్రబాబుకు షుగర్, బీపీ స్థాయిలు సాధారణంగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. మంచినీరు తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు. ఈ దీక్షలో జనసేన పార్టీ నేతలు రాపాక వరప్రసాద్, శివశంకర్ కూడా పాల్గొన్నారు.
యురేనియం తవ్వకాలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు