ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ (72) ఆత్మహత్యాకు పాల్పడ్డారు. ఈ ఉదయం ఉరికి వేలాడుతున్న ఆయన్ను గమనించిన కుటుంబీకులు హైదరాబాద్లోని బసవతారం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. ఆసుపత్రికి తీసుకుని వచ్చే వరకే కోడెల శ్వాస ఆడటం లేదని వైద్యులు గుర్తించారు. వెంటనే అత్యవసర చికిత్స చేసినా, ఆయన గుండె స్పందించలేదని వైద్య వర్గాలు వెల్లడించాయి.
ఇటీవల తూళ్లూరు పోలీసులు కోడెలపై అసెంబ్లీ ఫర్నీచర్ దొంగతనం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కోడెల కొడుకు శివరాం, కూతురుపై ట్యాక్స్ వేధింపుల కేసులుతో తీవ్ర మనస్థాపంకు గురైనట్లు సమాచారం.