ఏపీలో వారం రోజుల్లోనే కరోనా కేసులు రెట్టింపు అయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. కరోనా తీవ్రతను గురించి తాము ప్రభుత్వాన్ని ముందు నుంచే హెచ్చరిస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు. వైసీపీ నేతల నిర్లక్ష్యం వల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని ఆయన ఆరోపించారు.
లాక్ డౌన్ నేపథ్యంలో వైసీపీ నేతలు నిబంధనలు పాటించట్లేదని ఆయన విమర్శించారు. కరోనా విపత్కర సమయంలో ముఖ్యమంత్రి జగన్ చేస్తోన్న వ్యాఖ్యలు ప్రజలను ఆవేదనకు గురి చేస్తున్నాయని ఆయన విమర్శించారు. వలస కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారిందని చంద్రబాబు అన్నారు. కూలీలు తమ సొంత గ్రామాలకు చేరేందుకు వందల కిలోమీటర్లు నడవడం చూస్తుండే మనసు కలిచివేస్తోందని ఆయన చెప్పారు.
భవన నిర్మాణ కార్మికులు, చేతి వృత్తులు, ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయారని ఆయన అన్నారు. రైతులు తమ పంటలను పొలంలో, రోడ్డు మీద వదిలేస్తున్నారని చంద్రబాబు నాయుడు తెలిపారు. పంట ఉత్పత్తులు కొనాలని తాము అడిగామని, మార్కెట్ ఇంటర్వెన్షన్ కోరామని ఆయన చెప్పారు. రైతులను ఆదుకోవాలని తాము చాలా లేఖలు రాశామని అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని తెలిపారు.
ఏపీలో మతమార్పిళ్లు తప్ప మరేం జరగడం లేదు: కన్నా