telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

“కరోనా” ను మించిపోయిందీ వైసీపీ వైరస్: చంద్రబాబు

chandrababu

చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కన్నా వైసీపీ వైరస్ మించిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ ఎనిమిది నెలల్లోనే ఏపీని వైసీపీ చెల్లాచెదురు చేస్తోందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే పెట్టుబడిదారులు భయపడి పారిపోతున్నారని అన్నారు. కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు పోతున్నాయి” అంటూ చంద్రబాబు ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు.

“ఒక్క కంపెనీని తీసుకొచ్చే సమర్థత లేదు, యువతకు గౌరవప్రదమైన ఒక్క ఉద్యోగం ఇవ్వడం చేతకాదు కానీ విశాఖలో లక్షణంగా ఐటీ ఉద్యోగాలు చేసుకుంటున్న 18 వేల మంది ఉద్యోగాలకు ముప్పు తెచ్చే హక్కు మీకెవరిచ్చారు?” అంటూ మండిపడ్డారు. సొంతంగా ఒక్క భవనం కట్టుకోలేని మీరు ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తారా? అంటూ నిలదీశారు.

Related posts