ఇంగ్లీషు విద్య వద్దని ఎవరూ చెప్పలేదని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ అన్నారు. కోర్టులు మొట్టికాయలు వేసినా వైసీపీ మూర్ఖపు ఆలోచనలు మారడం లేదని విమర్శించారు. కింద పడినా మాదే పైచేయి అనే విధంగా ఆ పార్టీ నేతలు ప్రవర్తిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు.
రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడం గత టీడీపీ హయాంలోనే జరిగిందని చెప్పారు. మీడియంను ఎంచుకునే అవకాశాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకే టీడీపీ ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు.మీడియంను ఎంచుకునే అవకాశాన్ని పిల్లలు, తల్లిదండ్రులకు ఇవ్వాలనే కోర్టు చెప్పిందని అనురాధ తెలిపారు. ఏపీ హైకోర్టులో అన్ని విషయాలు బయటపడ్డాయని ఆమె అన్నారు.