telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కనగరాజ్‌ను ఎందుకు క్వారంటైన్ చేయలేదు: ప్రశ్నించిన టీడీపీ

Alapati Rajendera prasad tdp

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హైద్రాబాద్ నుంచి ఏపీకి రావాలంటే, 14 రోజుల క్వారంటైన్ పాటించాల్సిందేనని వైసీపీ నాయకులు వ్యాఖ్యానించిన నేపథ్యంలో టీడీపీ ఘాటుగా స్పందించింది. తమిళనాడు నుంచి వచ్చిన కనగరాజ్‌ క్వారంటైన్ పాటించాల్సిన అవసరం లేదా? అంటూ మండిపడింది.

టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ రోజు ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఎస్ఈసీగా నియమితులైన మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి కనగరాజ్‌ చెన్నై నుంచి వచ్చారని గుర్తు చేశారు. ఆయన్ను ఎందుకు క్వారంటైన్ చేయలేదని ప్రశ్నించారు. కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేస్తున్నప్పటికీ, జగన్ సర్కారు పట్టించుకోకుండా ముందుకు వెళుతోందని ఆలపాటి విమర్శలు గుప్పించారు. స్థానిక ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతో గ్రామ, వార్డు వాలంటీర్లతో ప్రచారం సాగిస్తున్నారని ఆరోపించారు.

Related posts