తమిళనాడు రాష్ట్రంలో ప్రమాద వశాత్తు ఓ స్కూల్ బస్సు బోల్తా పడడంతో 20 మంది విద్యార్థులకు గాయాలు గాయాలయ్యాయి. ఈ ఘోరప్రమాదం మధురైలో జరిగింది. విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూల్ బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది.
ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. విద్యార్థులను చికిత్స నిమిత్తం మధురై రాజాజి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.