telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బ్రేకింగ్: కరోనాతో వ్యవసాయ శాఖ మంత్రి మృతి

క‌రోనా వైర‌స్ ఎవరినీ వదలడం లేదు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. సాధార‌ణ ప్ర‌జ‌లు అయినా స‌రే.. ప్ర‌ధాని అయినా స‌రే.. ప్ర‌జాప్ర‌తినిధి అయినా స‌రే.. అధికారి అయినా స‌రే దానికి మాత్రం ఏ మాత్రం వివ‌క్షలేదు.. అదును దొరికితేచాలు ఎటాక్ చేస్తోంది.. ఇప్ప‌టికే ఎంతోమంది ప్ర‌జాప్ర‌తినిధులు క‌రోనాబారిన ప‌డ్డారు.. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన నేత‌ల‌ను కూడా ట‌చ్ చేసింది క‌రోనా.. తాజాగా కరోనా తో  తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి దురైక్కన్ను (72) మృతి చెందాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన ఆయన అక్టోబర్ 13 న ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. 1948 లో తంజావూర్ జిల్లా రాజగిరిలో జన్మించిన మంత్రి దురైక్కన్ను మూడు సార్లు పాపనాశం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా విజయం సాధించారు. 2016 లో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు భార్య నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మంత్రి దురైక్కన్ను మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు.

Related posts