telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : బెంగుళూరు సునాయాస విజయం…

ఈరోజు ఐపీఎల్ 2020 లో కోల్‌కత నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఇందులో టాస్ గెలిచిన కేకేఆర్ మొదట బ్యాటింగ్ ఎంచుకొని దారుణంగా విఫలమైంది. పవర్ ప్లే లోనే కేవలం 14 పరుగులకు 4 వికెట్లు తీసిన బెంగళూరు బౌలర్లు ఎవరిని నిలదొక్కుకోనివ్వలేదు. కానీ కెప్టెన్ మోర్గాన్ 30 పరుగులు చేయడంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 84 పరుగులు చేసింది. ఇక 85 పరుగుల లక్ష్యంతో బరిలోకి వచ్చిన బెంగళూరు ఎక్కడ తొందరపడకుండా నిదానంగా ఆడింది. జట్టు ఓపెనర్లు ఇద్దరు దేవదత్ పడిక్కల్ (25), ఆరోన్ ఫించ్ (16) పెవిలియన్ కు చేరుకున్న తర్వాత గుర్కీరత్ సింగ్ మన్(21), కెప్టెన్ విరాట్ కోహ్లీ (18) తో మరో వికెట్ పడకుండా జట్టును 13.5 ఓవర్లలోనే విజయతీరాలకు చేర్చారు. ఇక కోల్‌కత బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ ఒక వికెట్ తీసుకున్నాడు. అయితే బెంగళూరు కు ఐపీఎల్ 2020 లో ఇది 7వ విజయం… దాంతో పాయింట్ల పట్టికలో ముంబై ని వెనక్కి నెట్టి రెండవస్థానికి వచ్చింది. ఇక బెంగళూరు మిగిలిన 4 మ్యాచ్ లలో మరో విజయం సాధిస్తే చాలు ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం అవుతుంది. ఇక ఈ ఐపీఎల్ లో 5 ఓటమి చుసిన కోల్‌కత అదే 4వ స్థానంలో ఉంది.

Related posts