తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయంపై టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయంతో అమ్మకాలు ప్రారంభించారు. పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను తిరుమల తిరుపతి దేవస్థానములు ఆధ్వర్యంలో కర్నూల్ విక్రయిస్తున్నారు.
స్థానిక సి.క్యాంపులోని టీటీడీ కల్యాణమంటపంలో ఈ ప్రసాదం విక్రయిస్తున్నారు. లడ్డూ రూ.25 చొప్పున ఒక్కో భక్తునికి నాలుగు లడ్డూలను విక్రయిస్తున్నట్లు తిరుమల వైకుంఠం కాంప్లెక్స్ ఏఈవో మోహన్రాజు, టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా అధికారి డాక్టర్ మల్లు వెంకటరెడ్డి తెలిపారు. భక్తులు మాస్కులు ధరించాలని, తమ వెంట శానిటైజర్లు తెచ్చుకోవాలని వారు సూచించారు.