సొట్టబుగ్గల సుందరి తాప్సీ ఇప్పుడు బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. దక్షిణాది, ఉత్తరాదిన వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది తాప్సీ. తాజాగా తాప్సి మీటూ ఉద్యమం గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. “పనిచేసే ప్రదేశంలో జరిగే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళలు వారి గొంతుకను వినిపించడం మానుకోకూడదు. లైంగికంగా మహిళలను వేధించిన వారికి శిక్ష పడాలి. లేకుంటే లైంగిక ఆరోపణలు చేసిన మహిళలను సమాజం కించపరుస్తుంది. ఇలాంటి చర్యలు వల్ల సదరు మహిళలు కూడా కలత చెందుతారు. మీటూ ఉద్యమం కారణంగా లైంగిక వేధింపులకు సంబంధించిన చాలా ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ఉద్యమాన్ని వదిలేయకూడదు. అడ్డంకులు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. మార్పుకు ఇదే సమయం. అయితే ఇది కష్టమేనని నాకు తెలుసు. ఇప్పుడు విడిచిపెడితే మనం కోరుకునే మార్పు భవిష్యత్లో రాదు” అన్నారు తాప్సీ పన్ను.
previous post
next post
సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు నాకు తెలియదు… బాలయ్య సంచలన వ్యాఖ్యలు