105 రోజుల బిగ్ బాస్ నాగార్జున హోస్ట్గా 17 మంది కంటెస్టెంట్స్తో జూలై 21 ప్రారంభమైన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో ఆదివారం నాడు విజేతను ప్రకటించారు. బిగ్బాస్ తెలుగు-3 టైటిల్ను సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ రూ.50లక్షల నగదు బహుమతిని దానితో పాటు ఓ ట్రోఫీని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సీజన్కు విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్కు మెగాస్టార్ చిరు టైటిల్ను అందజేశారు. ఇక విన్నర్ అవుతుందని భావించిన శ్రీముఖి మాత్రం రన్నర్ తో సరిపెట్టుకుంది. ఆమెకున్న ఇమేజ్ కారణంగా బిగ్ బాస్ సీజన్ 3 విజేత ఆమెనే అని అంతా అనుకున్నారు. కానీ ఫైనల్గా రాహుల్ టైటిల్ను ఎగరేసుకుపోయి… శ్రీముఖిని రెండో స్థానానికి పరిమితం చేశారు. అయితే బిగ్ బాస్ 3 టైటిల్ చేజారడం కంటే ఎక్కువగా శ్రీముఖిని బాధపెడుతున్న అంశం మరొకటి ఉందని చాలామంది చర్చించుకుంటున్నారు. బిగ్ బాస్లో రన్నర్గా నిలిచిన శ్రీముఖి కంటే ఎక్కువగా రాహుల్, పునర్నవి గురించి మీడియా, సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతోంది. అసలు రన్నర్గా నిలిచిన శ్రీముఖి గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు. నిజానికి శ్రీముఖికి బిగ్ బాస్తో పెద్దగా కలిసొచ్చే ఇమేజ్ ఏమీ లేదనే చెప్పాలి. కానీ… ఈ విషయంలో మాత్రం తనను ఎవరూ పట్టించుకోకపోవడం శ్రీముఖికి ఇబ్బందిగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బిగ్ బాస్ 3తో శ్రీముఖిని పాపులర్ అయిన పునర్నవి, రాహుల్… ఇకపై కూడా ఆమెను డామినేట్ చేస్తారేమో చూడాలి.
previous post