మను అశోకన్ దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం “ఉయిరే”. పార్వతి ఇందులో ప్రధాన పాత్రధారిగా నటించారు. ప్రేమికుడి చేతిలో యాసిడ్ దాడికి గురయ్యే అమ్మాయిగా పార్వతి నటించారు. ఫైలట్ కావాలనుకున్న అమ్మాయి యాసిడ్ దాడి తర్వాత ఎలాంటి పరిణామాలను ఎదుర్కొందనేదే “ఉయిరే” కథ. ఏప్రిల్లో విడుదలైన ఈ సినిమాను సమంత తాజాగా చూసి ఎమోషనల్ అయ్యారు. నటి పార్వతి, దర్శకుడు మను అశోకన్ సహా ఎంటైర్ యూనిట్ను ప్రశంసిస్తూ ఆమె ట్వీట్ చేశారు. “ఉయిరే” చిత్రం మీకు కోపాన్ని తెప్పిస్తుంది, ఏడిపిస్తుంది, ఆలోచింపచేస్తుంది. ప్రేమించేలా చేయడమే కాదు.. మీలో నమ్మకాన్ని కూడా పెంపొందిస్తుంది, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. థాంక్యూ పార్వతిగారు, మీరు మాకు గర్వకారణం. లవ్ యు టీమ్” అంటూ సమంత స్పందించారు. సమంత ట్వీట్కు పార్వతి ధన్యవాదాలు తెలిపారు.
previous post
next post