telugu navyamedia
సినిమా వార్తలు

సైరా : టార్గెట్ ను చేరుకుంటుందా ?

Syeraa

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 20న విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ సినిమా నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల కానుంది. బుధవారం విడుదలైన చిత్ర ట్రైలర్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులను దాదాపు 120 కోట్ల రూపాయలకు అమ్మినట్టు సమాచారం. డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే “సైరా” 135 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించాలి. “సాహో” సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి 90 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. అంటే “సైరా”కు “సాహో”ను మించి “బాహుబలి-2” స్థాయిలో కలెక్షన్లు రావాలి. అప్పుడే అందరికీ లాభాలు వస్తాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. దసరా సెలవులు, పండగ సీజన్, మెగాస్టార్ క్రేజ్, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ దృష్ట్యా “సైరా” 135 కోట్ల టార్గెట్‌ను కచ్చితంగా రీచ్ అవుతుందని విశ్లేషణలు వినబడుతున్నాయి.

Related posts