సూపర్స్టార్ మహేశ్బాబు, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా ‘సర్కారు వారి పాట’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ విడుదలైన అభిమానుల్లో అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా గత నెల ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫస్ట్ సింగిల్ ‘కళావతి’ సాంగ్ యూట్యూబ్ను షేక్ చేసింది.
తాజాగా ‘సర్కారు వారి పాట’ సినిమాలో సెకండ్ సింగిల్ విడుదల చేశారు చిత్రయూనిట్. నిన్న ప్రోమోను విడుదల చేయగా.. ఈ రోజు ఫుల్ సాంగ్ ను విడుదల చేశారు. “ఎవ్రీ పెన్నీ ఎవ్రీ పెన్నీ’’ అంటూ సాగే పాట విడుదలైన కాసేపటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు.
తొలిసారి సితారా గట్టమనేని తన తండ్రి తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. పెన్నీ సాంగ్ తో వెండితెరకు కూడా పరిచయం అయ్యింది. ప్రతి రూపాయిని అందరూ గౌరవించాలంటూ సాగే ఈ పాటలో తండ్రీకూతుళ్ల స్టెప్స్ కి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
ఈ వీడియోని షేర్ చేసిన మహేశ్.. “పెన్నీ పాట నాకెంతో స్పెషల్. నా రాక్స్టార్ని చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది” అని పేర్కొన్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.