telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మైదానం”  చిత్రం ప్రారంభం

maidanam movie launch
     శ్రీ సాయి సిరి సంపద మూవీస్ పతాకంపై జై శంకర్,తనీష్ అగర్వాల్ జంటగా తెరకెక్కనున్న “మైదానం” చిత్రం నేడు పూజ కార్యక్రమాలతో హైదరాబాద్ లో ప్రారంభమైయింది.
     ఈ సందర్భంగా చిత్ర దర్శకులు జై శంకర్ మాట్లాడుతూ ఇదొక డిఫరెంట్ యాక్షన్ సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ చిన్న పిల్లల మీద బీహార్ లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం.ఈ నెల 7 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.ఈ చిత్రంలో సీనియర్ నటీనటులతో పాటు కొత్తవారు నటించనున్నారు.ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నం.హైదరాబాద్,వైజాగ్,రాజముండ్రి,కేరళ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం అన్నారు.
      జై శంకర్,తనీష్ అగర్వాల్,పోసాని,నాగబాబు,సుమన్,భానుప్రియ,రంగస్థలం మహేష్,జబర్దస్త్ రాము,రవి దాసరాజు,కరీంషేక్,లతిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డి.ఒ.పి:క్రాంతి కొణిదెల,సంగీతం:యమ్.యమ్ కుమార్,డైలాగ్ రైటర్:ముప్పూరి.శివ ప్రసాద్,ఎడిటర్:K ,R స్వామి,కొరియోగ్రఫి:రాజ్ పైడి,నిర్మాతలు:డి.నాగరాజు,ఎం.శివరామకృష్ణ,దర్శకత్వం:జై శంకర్.

Related posts