బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా మరోసారి తాను ధరించిన డ్రెస్తో వార్తల్లో నిలిచారు. ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా పేరొందిన ఈజిప్ట్ మహారాణి క్లియోపాత్రలా 5 మిలియన్ డాలర్ల (సుమారు రూ.37 కోట్ల) విలువైన దుస్తులు ధరించి సిద్ధమయ్యారు ఊర్వశి. ఆమె ధరించిన కాస్ట్యూమ్ను బంగారంతో తయారు చేయడం విశేషం. అత్యంత ఖరీదైన ఈ దుస్తుల్లో అరబ్ ఫ్యాషన్ వీక్లో ఊర్వశి దర్శనమిచ్చారు. అంతేకాదు అరబ్ ఫ్యాషన్ వీక్ షోలో టాపర్గా నిలిచిన తొలి ఇండియన్గా ఊర్వశి నిలిచారు. అలాగే ఈ డ్రెస్లోనే ఊర్వశిపై ఒక షార్ట్ ఫిల్మ్ను కూడా చిత్రీకరించారు.
View this post on Instagram
Egyptian Princess Queen 👑 I will not be triumphed over ~ #Cleopatra #love #UrvashiRautela #BTS
ఊర్వశి రౌతెలా ఫ్యాషన్కు పెట్టింది పేరు. ఆమె ధరించే దుస్తులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. మోడలింగ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఊర్వశి.. సినిమా ఫంక్షన్లు, ఫ్యాషన్ షోలలో వైవిధ్యమైన దుస్తుల్లో మెరుస్తుంటారు. ఈ ఏడాది ఫిల్మ్ఫేర్ అవార్డుల వేడుకలో ఆమె ధరించిన స్కై రెడ్ గౌన్ ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది. ఇదివరకు ఊర్వశి రౌతెలా గతంలో నేహా కక్కర్ వివాహ వేడుకలో రూ.55 లక్షల విలువైన లెహెంగా ధరించారు. ఆ లెహెంగాలో ఆమె చాలా అందంగా కనిపించి అందరి మనసులు కొల్లగొట్టారు. ఇప్పుడు రూ.37 కోట్ల విలువైన దుస్తులు ధరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇదిలా ఉంటే, ఊర్వశి ప్రస్తుతం ‘బ్లాక్ రోజ్’ అనే హిందీ, తెలుగు ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు.