telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ ఆత్మతో పారానార్మల్ యాక్టివిస్ట్… వీడియో వైరల్

Sushanth singh rajput

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి నెల రోజులు గడిచింది. ఈ క్రమంలో ఓ పారానార్మలిస్ట్ సుశాంత్‌ సింగ్ ఆత్మతో మాట్లాడానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మతో తాను మాట్లాడినట్లుగా ప్రముఖ పారానార్మల్ యాక్టివిస్ట్ స్టీవ్ హుఫ్ తెలిపాడు. ఆయన ఈ పారానార్మల్ వర్క్ దాదాపు పదేళ్లుగా చేస్తున్నాడు. ఇలాంటి పని కోసం స్టీవ్ ఎన్నో పరికరాలు కనుగొన్నాడట. ఆయన ట్విట్టర్ వేదికగా సుశాంత్ గురించి పోస్ట్ పెట్టి షాక్ ఇచ్చాడు. జూలై 13వ తేదీన ఆస్ట్రల్ డోర్ వే సహాయంతో సుశాంత్ ఆత్మను సంప్రదించానని స్టీవ్ హుఫ్ తెలిపారు. ఈ క్రమంలో తాను రెండు రోజుల క్రితం సుశాంత్ ఆత్మతో మాట్లాడానని తెలిపారు. అంతేగాక ఇంకా సుశాంత్ తో సంభాషణ పూర్తికాలేదు. ఇంకా ఫాలో అప్ చేస్తూనే ఉంటానని ఒక వీడియోను యూట్యూబ్లో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రకారం.. హుఫ్ ఒక పరికరం ద్వారా ఆత్మల ప్రపంచంతో కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది. అతడు సుశాంత్‌ ఆత్మతో మాట్లాడాడు. పలు ప్రశ్నలను కూడా అడిగాడు. సుశాంత్ ఆత్మతో పాటు ఒక మగ ఆత్మ.. ఆ తర్వాత మహిళ శబ్దాలు విన్పిస్తున్నాయి. ఇక ఆ మహిళ వీడియో చివర్లో “ఇది ముగుస్తోంది’ అని చెబుతుంది. ఇందులో సుశాంత్ మరణానికి సంబంధించిన ప్రశ్నల్ని కూడా హుఫ్ అడిగాడు. నువ్వు ఎందుకు మరణించావు. నీ మరణానికి కారణాలేంటి ? ఆత్మహత్య చేసుకున్నావా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అంటూ ప్రశ్నలు వేశాడు? అయితే వీటికి సుశాంత్ ఆత్మ సరైన సమాధానాలు మాత్రం ఇవ్వలేదు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Related posts