ఛత్తీస్గఢ్ బస్తర్లో జరిగిన నక్సల్స్ దాడిలో 10 మంది పోలీసులతో పాటు ఒక డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మావోలు మందుపాతర పేల్చడంతో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ మందుపాతర పేల్చేందుకు మావోలు 50 కిలోల ఐఈడీ(IED)ని వినియోగించారు. పేలుడు ధాటికి పెద్ద ఎత్తున గోతి ఏర్పడింది
డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్కు చెందిన పోలీసులు ఓ అద్దె వ్యానులో వెళుతుండగా ఈ ఘటన జరిగింది. పేలుడు ధాటికి కనీసం 20 అడుగుల ఎత్తుకు వాహనం ఎగిరి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రహదారి మధ్యలో ఏర్పడిన గోతి చూస్తే మావోలు ఎంత శక్తివంతమైన ఐఈడీ వినియోగించారో అర్థమవుతోందని అధికారులు అన్నారు.
next post
గులాబీ జెండా ఎగరడం ఖాయం: మంత్రి గంగుల