పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతుండగా, జి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహేష్ కెరీర్లో 27వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాలో మహేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో జరుగుతోంది. ఇది ఇలా ఉంటే.. మహేష్బాబు ఈ మూవీ తర్వాత మరో సినిమాను చేయనున్నాడట. అది కూడా ఓ లేడీ డైరెక్టర్తో కావడం విశేషం. గురు, ఆకాశమే నీ హద్దురా లాంటి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న మహిళా దర్శకురాలు సుధ కొంగర…. ప్రిన్స్ మహేష్ కోసం ఇప్పటికే ఓ కథను సిద్ధం చేసిందట. త్వరలోనే ఈ కథపై చర్చలు కూడా జరుగనున్నాయని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ కోసం మహేష్ దుబాయ్ వెళ్లగా…ఆయన హైదరాబాద్ తిరిగొచ్చిన తర్వాత సుధ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతాయని తెలుస్తోంది.
previous post
next post