స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ను బన్నీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లుక్కు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్గా నటిస్తుండగా హీరోయిన్ రష్మికా మందన్నా డీగ్లామర్ పాత్రలో కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా విలన్ పాత్రకు సంబంధించి ఓ వార్త ప్రచారంలో ఉంది. దీని ప్రకారం.. పుష్ప యూనిట్ బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టిని విలన్ పాత్ర కోసం సంప్రదించారు. తన పాత్ర ఆసక్తికరంగా ఉండటంతో ఆయన కూడా ఓకే చెప్పాడు. తొలుత విలన్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ అగ్ర నటులు సంజయ్ దత్, జాకీ ష్రాఫ్ల పేర్లను దర్శకనిర్మాతలు పరిశీలించినప్పటికీ సునీల్ శెట్టి వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
previous post
కావాలనే కొందరు సూర్యను టార్గెట్ చేస్తున్నారు… భారతీరాజా షాకింగ్ కామెంట్స్