telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

50 కుటుంబాలకు అండగా… బాపుబొమ్మ

praneta

“అత్తారింటికి దారేది” సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా కూడా ప్రణీత స్టార్ కాలేక‌పోయింది. అయితే “అత్తారింటికి దారేది” ఇచ్చిన ఊపులో వ‌ర‌స‌గా కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా ఫిక్సైపోయింది. అలా ఉంటే కరోనా మహమ్మారి వల్ల సినీ పరిశ్రమ తాత్కాలికంగా మూతపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ కార్మికుల సంక్షేమం నిమిత్తం హీరోలు, దర్శకులు, నిర్మాతలు వారికి తోచిన విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ప్రకటించిన వారిలో దాదాపు హీరోలు, దర్శకులు, నిర్మాతలు మాత్రమే ఉన్నారు కానీ.. హీరోయిన్స్ మాత్రం లేరు. తాజాగా హీరోయిన్ ప్రణీత ముందుకు వచ్చి తన వంతు సాయంగా రూ. లక్ష విరాళాన్ని ప్రకటించింది. దీనికి సంబందించిన ఓ వీడియోను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ప్రణీత మాట్లాడుతూ, ఈ కష్ట కాలంలో ఒక్కో కుటుంబానికి కనీసం రూ. 2 వేలు అవసరమని తమ ప్రణీత ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయలతో 50 కుటుంబాలకు తన వంతుగా సాయం చేస్తున్నాని తెలిపింది.

Related posts