telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న సునీల్

Sunil

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో తాజాగా పాల్గొని మొక్కలు నాటారు సునీల్. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటుడు రాజా రవీంద్ర ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి పూర్తి చేశారు నటుడు సునీల్. నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటారు‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. మన పెద్దలు “వృక్షో రక్షిత రక్షితః” అని చెప్పారు. కాబట్టి నా బాధ్యతగా ఈ రోజు మూడు మొక్కలు నాటడం జరిగింది అని సునీల్ పేర్కొన్నారు. ఈ ఛాలెంజ్‌ని ప్ర‌తి ఒక్క‌రు బాధ్యతగా స్వీకరించి మొక్కలు నాటి ముందుకు తీసుకుపోవాలని కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశం మొత్తాన్ని పచ్చని వనంలాగా‌ తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు అని అన్నారు సునీల్. ఆర్టిస్ట్ సురేఖ వాణి, కలర్ ఫోటో సినిమా చిత్ర బృందం డైరెక్టర్ సందీప్ రాజ్, హీరో సుహాస్, హీరోయిన్ చాందిని చౌదరి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు కాల భైరవ, కమెడియన్ వైవా హర్షలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు సునీల్.

Related posts