ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన “కాంచన”కు హిందీ రీమేక్ గా “లక్ష్మీ బాంబ్” ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచేశారు. కాంచన చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ భారీ సినిమా ట్రైలర్ తో మరింత స్థాయిలో భారీ రెస్పాన్స్ ను అందుకుంది. ఈ చిత్రం ప్రీమియర్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో నవంబర్ 9 నుంచి ప్రసారం కానుంది. దీంతో హీరో అక్షయ్ కుమార్, యూనిట్ సినిమా ప్రమోషన్లో చాలా బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి లక్ష్మీ బాంబ్ అనే టైటిల్ ఫిక్స్ చేయగా, కొందరు దీనిపై రచ్చ చేయడంతో లక్ష్మీగా మార్చారు. అయినప్పటికీ దీనిపై ట్రోల్ నడుస్తూనే ఉంది. అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ఫొటోని మార్ఫింగ్ చేసి ఆ ఫోటోపై ట్వింకిల్ బాంబ్ అని రాసారు. ఇది ట్వింకిల్ ఖన్నా దృష్టికి రాగా, ట్రోలర్స్కు గట్టి సమాధానం ఇచ్చింది. ట్వింకిల్ ఖన్నా ఫోటోని నీలి రంగులోకి మార్చి నుదుటున ఎర్రటి బొట్టు పెట్టారు. ఈ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన అక్షయ్ భార్య.. “ఈ ఫోటోకు నన్ను ట్యాగ్ చేసాడు ఓ థర్డ్ క్లాస్ పర్సన్. దేవుడి మీద జోకులు చేస్తారా ? అవును మరి… దేవుడికి జోకులంటే ఇష్టం కాబట్టే భూమి మీదకు నీలాంటోడిని పంపాడు. ఈ ఫొటో సాయంతో దీపావళికి పటాసులా రెడీ అవుతాను” అంటూ ఘాటుగా స్పందించారు ట్వింకిల్.
previous post