ప్రభాస్ హీరోగా ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో సినిమా చిత్రీకరణకు ముందుకు రావాలి. కానీ నాగ్ అశ్విన్ సినిమాకన్నా ముందుగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆదిపురుష్ సినిమా పట్టాలెక్కనుంది. ప్రభాస్ ఎందుకు తన షెడ్యూల్ మార్చాడు. ఆదిపురుష్ 2022లో విడుదకానుంది. దాని తరవుతే నాగ్ అశ్విన్ సినిమా మొదకానుందా, హీరోయిన్గా దీపికా పదుకొణే, బాలీవుడ్ అగ్ర నటుడు అమితామ్ కీలక పాత్ర అన్నారు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది. అన్న ప్రశ్నలతో పాటు ఇలా అయితే ఈ సినిమా మొదలయ్యే సమయానికి ప్రభాస్, దీపికా పరుకొణే ఎలా ఉంటారో అంటూ కామెంట్లు కూడా వచ్చాయి. అయితే తాజా అందుతున్న సమాచారం ప్రకారం నాగ్ సినిమా వచ్చే ఏడాది వేసవి చివరకు మొదలు కానుంది. ఈ సినిమా స్క్రిప్టు దాదాపు పూర్తికావచ్చింది. నటీనటుల ఎంపి కూడా అయిపోయింద. అన్ని సరిగ్గా జరిగితే ఈ సినిమా కూడా 2022లో విడుదలకు సిద్దమవుతుంది. ఆదిపురుష్ సినిమాలో ఎక్కువాగా విజువల్ ఎఫెక్ట్లు ఉంటాయి కాబట్టి షూటింగ్ను కుదిరినంత త్వరగా పూర్తి చేసుకోవాలి. అన్ని అనుకున్నట్లు జరిగిత ఆదిపురుష్ షూటింగ్ ఆరునెలల్లో అయిపోతుంది. వెంటనే నాగ్ సినిమా పట్టాలెక్కుతుందంటున్నారు.
previous post
టీడీపీ అధికారంలోకి వస్తే హైద్రాబాద్ కంటే అభివృద్ధి: నటి దివ్యవాణి