వరల్డ్ కప్ లో భాగంగా నేడు జరిగిన న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య కార్డిఫ్ మ్యాచ్ కూడా లో స్కోరింగ్ పోటీగా మారింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లంక 29.2 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. కెప్టెన్ కరుణరత్నే (52 నాటౌట్) అజేయ అర్థసెంచరీతో పోరాడడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.
ఆ జట్టులో ఎనిమిది మంది సింగిల్ డిజిట్ స్కోరుకు పరిమితమయ్యారు. పిచ్ పై పచ్చికను సద్వినియోగం చేసుకున్న న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు మాట్ హెన్రీ, లాకీ ఫెర్గుసన్ చెరో 3 వికెట్లతో లంకేయుల పనిబట్టారు. లంక ఇన్నింగ్స్ లో కుశాల్ పెరెరా 29, తిస్సర పెరెరా 27 పరుగులు చేశారు.
నేను ట్రెండ్ ఫాలో అవ్వను బ్రదర్, ట్రెండ్ సెట్ చేస్తా… నితిన్ కామెంట్స్ పై సాయి ధరమ్ తేజ్