నాగార్జునసాగర్ ఉపఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఇవాళ్టితో గడువు ముగియనుంది. నిడమనూరు ఆర్వో కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ల దాఖలుకు సమయం ఉండగా…ఇవాళ ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆరెస్, బీజేపీ , టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ తరుణంలో బీజేపీ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి టికెట్ ఆశించిన కడారి అంజయ్య టీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు సమాచారం అందుతోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి బలంగా టికెట్ ఆశించాడు కడారి. అయితే.. చివరి నిమిషంలో రవి నాయక్ కు టికెట్ ఇచ్చింది బీజేపీ. ఇప్పటికే అంజయ్యతో ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చలు జరిపినట్లు సమాచారం అందుతోంది. అంజయ్యతో చర్చలు జరిపిన పైల శేఖర్ రెడ్డి, రవింద్ర కుమార్ నాయక్, సైదిరెడ్డి ఉన్నారు. చర్చలు సఫలం కావడంతో టీఆర్ఎస్ లో చేరేందుకు అంజయ్య యాదవ్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంజయ్యకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా లభించిందని సమాచారం అందుతుంది. మరికాసేపట్లో సీఎం కేసీఆర్ ను కలిసి టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు అంజయ్య.
next post