telugu navyamedia
క్రైమ్ వార్తలు

కాకినాడ‌లో దారుణం: భార్యను కాపురానికి పంపలేదని అత్తను న‌రికి చంపిన‌ అల్లుడు

కాకినాడ లోని పిఠాపురం విద్యుత్నగర్లో దారుణ హత్య జరిగింది. కుటుంబ కలహాలతో అత్త రమణమ్మ(46)ను అతి కిరాతకంగా అల్లుడు హత్య చేశాడు.

భార్యను కాపురానికి పంపడం లేదన్న అక్కస్సుతో కసి పెంచుకున్న అల్లుడు రమేష్ బుధవారం ఈ దారుణానికి పాల్పడ్డాడు.ఉదయం వాకిలి తుడిచేందుకు ఇంటి బయటకు వచ్చిన అత్త రమణమ్మపై రమేష్ కత్తితో దాడి చేశాడు.

దాడి చేస్తున్న సమయంలో అడ్డుకున్న మామ, బావమరిదిపై అల్లుడు రమేష్ కత్తితో దాడి చేశాడు. అడ్డుపడ్డవారికి తీవ్ర దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. బంధువులు బాధితులను ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts