telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు

కారుతో పాటు వ్యక్తి దహనమైన కేసును ఛేదించిన పోలీసులు

రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలంలో కారుతో పాటు వ్యక్తి దహనమైన కేసు నిందితులను పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాల సాయంతో ఘటన జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించారు. తన భర్తకు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని, తరచూ తనతో గొడవ పడేవాడని మృతిచెందిన వ్యాపారి శ్రీనివాస్‌ భార్య నిన్న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పలువురితో స్థిరాస్తి వ్యాపార లావాదేవీల్లోనూ గొడవలు జరుగుతున్నాయని కూడా ఆమె చెప్పారు.

ఈ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. రూ‌. కోటిన్నర డీలింగ్ వ్యవహారం 15 లక్షల చొప్పున చెల్లిస్తానని చెప్పిన శ్రీనివాస్
తిరిగి డబ్బులు చెల్లించని కారణంగా మర్డర్ చేసినట్లు తెలుస్తోంది. కారులో ఉండాగానే శ్రీనివాస్‌ను కత్తితో పొడిచి చంపినట్లు తేల్చారు. ఆ తర్వాత 6 గంటలపాటు శవంతోనే తిరిగిన నిందితులు ఆనవాళ్లు తుడిచేందుకే కారును దగ్ధం చేసిన దుండగులు
పోలీసులు అదుపులో ముగ్గురు నిందితులు.

Related posts