telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ప్రైవేటు బస్సు బోల్తా.. 37 మంది కూలీలకు గాయాలు

Accident

దేశంలోని వలస కూలీలు తమ సొంతూళ్కు వెళ్ళేందుకు నానా తంటాలు పడుత్డున్నారు. వివిధ వాహనాల్లో వెళ్తున్న కార్మికులు మార్గమధ్యలోనే ప్రమాదాల బారిన పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 37 మంది వలస కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఉన్న ఇటుక బట్టీల్లో పనిస్తున్న వలస కార్మికులు ఉత్తరప్రదేశ్‌లోని హమిర్‌పూర్‌కు ప్రైవేటు బస్సులో వెళ్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లా సమీపంలో బస్సు ఒక్కసారిగా బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 37 మంది గాయపడ్డారు. సమీపంలో గ్రామస్తులు వారిని బస్సులోనుంచి బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. గాయపడినపడిన జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Related posts