telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వం కింద కాదు…ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నాం : సీపీ జోయల్

రఘునందన్ ఇంట్లో సోదాలపై సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ స్పందించారు. ఎన్నికల నిబంధనల ప్రకారమే పనిచేస్తున్నామని.. నిన్న ఏం జరిగింది అనేది ఎన్నికల కమిషన్ కి…డిజీపీ కి నివేదిక పంపించానన్నారు. నిన్న ఎన్నికల అధికారుల మీద దాడి చేసి డబ్బులు లాక్కెళ్లిన కేసులో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని..వీడియో ఆధారాలు సేకరించి రిమాండ్ తరలిస్తామని పేర్కొన్నారు. నా పై ఫిర్యాదు చేసినా… ఎన్నికల కమిషన్ ఏం జరిగింది అనే నివేదిక అడుగుతారు కదా అని పేర్కొన్నారు. ఏ పార్టీ ఫిర్యాదు చేసినా తనిఖీలు చేశామని.. పోలీసుల మీద నమ్మకం లేకపోతే…జిల్లా కలెక్టర్..ఎన్నికల పరిశీలకులకు కూడా ఫిర్యాదు చేయొచ్చు అని సూచించారు. బీజేపీ అభ్యర్థి మీద నిన్నటి ఘటనలో ఎలాంటి కేసు నమోదు చేయలేదని..ఆరోపణలు సహజమన్నారు సీపీ జోయల్. మేము ప్రభుత్వం కింద కాదు… ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నామని వెల్లడించారు. మాపై ఫిర్యాదు చేసిన వాళ్ళ తనిఖీల్లో చాలా చోట్ల డబ్బులు దొరకలేదన్నారు సీపీ జోయల్.

Related posts