telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనాతో ఖుష్బూ దగ్గర బంధువు మృతి

Khushboo

దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి ఇప్పటికే లక్షా 80 వేలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా, ఒక్క మహారాష్ట్రలోనే 62 వేల మందికిపైగా కరోనా బారిన పడ్డారు. వారిలో రెండువేల మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలోనే ముంబైలో ఉన్న ఖుష్బూ బంధువు కరోనా సోకి మృతి చెందడంతో కుష్బూ శోకతప్తులయ్యారు. కుష్బూ సమీప బందువుకు ఇటీవలే కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారట. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారని సమాచారం. ఈ విషయాన్ని కుష్బూ తన సోషల్ మీడియా ఖాతా‌ ద్వారా తెలిపారు. దీంతో పలువురు సినీరంగ ప్రముఖులు, ఆమె అభిమానులు ఓదార్చుతూ సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా బాలీవుడ్ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ (42) కూడా సోమవారం తెల్లవాడుజామున కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై కూడా స్పందించిన కుష్బూ.. ఆ వార్త విని షాకయ్యానని, గత రెండు నెలలుగా చిత్రసీమలో చోటు చేసుకుంటున్న మరణాలు బాధ పెడుతున్నాయని పేర్కొంది.

Related posts