telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పెళ్ళైన ఏడాదికే విడాకులు తీసుకున్న శ్వేతాబసు ప్రసాద్…!

Swetha-Basu-Prasad

“కొత్త బంగారులోకం” సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ నటి శ్వేతా బసు ప్రసాద్ విడాకులు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. వ్యాపారవేత్త అయిన రోహిత్ మిట్టల్‌ను శ్వేత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం పాటు డేటింగ్‌లో ఉన్న వీరు 2018 డిసెంబర్ 13న పెళ్లి చేసుకున్నారు. తొలి పెళ్లి రోజు జరుపుకోవడానికి సరిగ్గా మూడు రోజులు ఉందనగా వీరు విడిపోవడం బాధాకరం. ఈ విషయాన్ని శ్వేత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. “హాయ్, రోహిత్ నేను పరస్పరం మాట్లాడుకుని విడిపోవాలన్న నిర్ణయానికి వచ్చాం. కొన్ని నెలలుగా ఇద్దరం సమస్యలను పరిష్కరించుకోవాలని అనుకున్నాం. కానీ పరిష్కారం అవ్వలేదు. పుస్తకంలోని ప్రతీ పేజీని చదవకపోయినంత మాత్రాన ఆ పుస్తకం చెడ్డదని కాదు. కొందరు చదవలేక కొన్ని విషయాలను తెలుసుకోకుండా మిగిలిపోవచ్చు. చెరిగిపోని జ్ఞాపకాలను మిగిల్చినందుకు, నాలో స్ఫూర్తి నింపినందుకు ధన్యవాదాలు రోహిత్. నీ జీవితం గొప్పగా ఉండాలని కోరుకుంటూ నీ చీర్‌లీడర్” అని పేర్కొన్నారు. శ్వేత తన భర్తతో విడిపోవడానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. అప్పట్లో సినిమాల్లేక శ్వేతా సెక్స్ రాకెట్‌లో చిక్కుకున్న సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Related posts