telugu navyamedia
రాజకీయ వార్తలు

ఈ రోజు సువర్ణాక్షరాలతో రాయదగ్గది: శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే

udhav-thackeray shivasena

అయోధ్య కేసులో సుప్రీం కోర్టు ఈ రోజు కీలక తీర్పు నేడు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారత చరిత్రలో ఈ రోజు సువర్ణాక్షరాలతో రాయదగ్గదని వ్యాఖ్యానించారు. ఈ తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని తెలిపారు.

ఈ నెల 24న అయోధ్యను సందర్శిస్తానని ఆయన తెలిపారు. అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీని కలిసి ధన్యవాదాలు తెలుపుతానని అన్నారు. అలాగే, ఆయనకు అభినందనలు తెలియజేస్తానన్నారు. ఈ అంశంపై ఆయన గతంలో ‘రథయాత్ర’ నిర్వహించిన విషయం తెలిసిందే. తప్పకుండా ఆయనను కలిసి ఆశీస్సులు తీసుకుంటానని ఆయన ట్వీట్ చేశారు.

Related posts