ప్రతి నెల కోటి మంది జియో సభ్యత్వం పొందుతున్నారని రిలయన్స్ జియో కంపెనీ చైర్మన్ ముఖేశ్ అంబానీ అన్నారు. ముంబయిలో జరిగిన రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో తాము రూ.5.4 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టామని అన్నారు.
ముఖ్యంగా జియో టెలికాం సేవల కోసం భారీగా వెచ్చించామని తెలిపారు. రిలయన్స్ జియో కోసం వేసిన ఫైబర్ తో భూమిని 11 సార్లు చుట్టి రావొచ్చని వెల్లడించారు. 34 కోట్ల మంది జియో కస్టమర్లతో తామే అగ్రగాములం అని గర్వంగా చెప్పారు. భవిష్యత్ లో తమ సేవలను మరింత విస్తరిస్తామని స్పష్టం చేశారు.