telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

శిరోముండనం నిందితులకు రెండు వారాల రిమాండ్‌!

shiromundanam case

విశాఖలో జరిగిన శిరోముండనం ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.ఈ కేసులో నిందితులకు న్యాయస్థానం రెండు వారాలు రిమాండ్‌ విధించింది. దీంతో నూతన్‌ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిని పోలీసులు సెంట్రల్‌ జైలుకు తరలించారు.

నిందితులను విచారించేందుకు కస్టడీ పిటిషన్‌ వేసే అవకాశం ఉంది. మరోవైపు శిరోముండనం వ్యవహారంలో నూతన్‌ నాయుడు ప్రమేయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.

జ్యుడీషియల్‌ రిమాండ్‌ నుంచి తప్పించుకునేందుకు మధుప్రియ అనారోగ్యం అంటూ నాటకం ఆడారు. అయితే కేజీహెచ్‌ వైద్య పరీక్షల్లో ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.

కాగా తమ ఇంట్లో పని మానేశాడన్న నెపంతో నూతన్‌‌ నాయుడు భార్య మధుప్రియ కర్రి శ్రీకాంత్‌ అనే యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన శుక్రవారం జరిగిన విషయం విధితమే.

Related posts