telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

సీతానగరం శిరోముండనం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

ap high court

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పు గోదావరి జిల్లా సీతానగరం ఈ కేసులో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వైసీపీ నాయకులకు ఊరట లభించినట్టయింది. నిందితుల వాదనలు విన్న కోర్టు దళిత యువకుడికి శిరోముండనం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతల అరెస్ట్ సహా తదుపరి ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలంటూ బాధితుడు వరప్రసాద్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఓట్రైనీ ఎస్‌ఐతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్టయ్యారు.

Seethanagaram Tonsure AP High Court

Related posts